*2కే రన్ విజయవంతం*

విపనగండ్ల ఆగస్టు 11 (జనంసాక్షి) వీపనగండ్ల మండల కేంద్రంలో గురువారం రోజున ఉదయం ఎస్సై రామన్ గౌడ్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 75వ స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించిన 2కే రన్ విజయవంతం అయింది. ఈ సందర్భంగా వీపనగండ్ల గ్రామ సర్పంచ్ వంగూరు నర్సింహారెడ్డి మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా గ్రామంలోని యువతి యువకులు ఎంతో ఉత్సాహంతో జాతీయ జెండాలతో పాల్గొని ఈ 2కే రన్ ను విజయవంతం చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది యువకులు పాల్గొనడమే కాకుండా మండల ఉద్యోగులు మరియు అధికారులు ఎంపీడీవో కథలప్ప, వైద్యాధికారి షబానా, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యురాలు మౌలానాబి, జొల్లు నారాయణ, సింగిల్ విండో డైరెక్టర్ సూర్యనారాయణ, మీసాల రాము మాదిగ, ఏఎన్ఎంలు అంగన్వాడి టీచర్లు ఆశ వర్కర్స్, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.