20వేల మంది యాత్రికులను కాపాడిన సైన్యం

ఉత్తరాఖండ్‌ : చార్‌ ధామ్‌ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు భారత సైన్యం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటి వరకు 20 వేల మంది యాత్రికులను రక్షించినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి వీరేంద్ర సింగ్‌ మీడియాకు తెలిపారు. ఇంకా పర్వతాల్లో చిక్కుకున్నవారిని గుర్తించి రక్షించేందుకు సైన్యం ప్రయత్నిస్తోందని చెప్పారు.