25కు చేరిన ఉత్తరాఖండ్‌ మృతుల సంఖ్య

డెహ్రడూన్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో వరదలు బీభత్సవం సృష్టిస్తున్నాయి. ఉత్తరాది నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతికి నదుల ఒడ్డున ఉన్న ఇళ్లు, హోటళ్లు నేలకొరుగుతున్నాయి. భారీ వాహనాలు సైతం వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఈ వరదల దాటికి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 25కు చేరుకుంది. ఈ వరదల దాటికి సుమారు యాబై మందికిపైగా గల్లంతయ్యారు. చమేలీ జిల్లా గోవింద్‌గారి ప్రాంతాల్లో భారీ వర్షాలకు సుమారు పది హోటళ్లు నేలకొరిగాయి. తొంబై కార్లు, రెండు వందల ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి.