26 నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి నవరాత్రి ఉత్సవాలు

మల్దకల్ సెప్టెంబర్ 25(జనంసాక్షి)మల్దకల్ మండల కేంద్రంలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరిదేవి దేవస్థానంలో ఈనెల 26 నుండి అక్టోబర్ 5 వరకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని ఆర్యవైశ్య సేవా సంఘం మండల అధ్యక్షులు ఇల్లూరు నాగరాజు, పట్టణ అధ్యక్షులు బాదాం శ్రీనివాసులు,జిల్లా వాసవి సేవా సమితి అధ్యక్షులు మనసాని నాగరాజు,ఆవోప అధ్యక్షులు నరహరి వెంకటేష్,యువజన సంఘం అధ్యక్షులు నరహరి ప్రవీణ్, మహిళా సంఘం అధ్యక్షురాలు ఇల్లూరు పద్మజ తెలిపారు.26న బాలా త్రిపుర సుందరీ దేవి,27న రాజరాజేశ్వరి దేవి,28న లలితా దేవి,29న అన్నపూర్ణాదేవి,30న ధనలక్ష్మీదేవి,1న వెంకటేశ్వర స్వామి,2 న సరస్వతీదేవి,3న దుర్గాదేవి,4 న మహిషాసుర మర్దిని,5 న వాసవి మాత అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు.విజయదశమి రోజున బాదం వారి కుటుంబం సౌజన్యంతో రెండు విడిది గదులు, ఆఫీస్ రూమ్, యువజన సంఘం ఆధ్వర్యంలో 25 కే.వి జనరేటర్ ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు,కుంకుమార్చన జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.