27′ చలో హైదరాబాద్: కోదండరాం
హైదరాబాద్: ఈ నెల 27న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలియజేశారు. 21న గద్వాల్,23న పాలేరు. 24 హుజుర్నగర్ నియోజక వర్గాలో జేఏసీ ఆధ్వర్యంలో టూర్ నిర్వహించనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ జేఏసీనే యూపీఏ భాగస్వామ్య పక్షాలను కలుపుతుందని కోదండరాం తెలిపారు. అయితే తెలంగాణ రాజకీయ నేతలు కూడా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు.