2K ఫ్రీడం రన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు11(జనంసాక్షి):
75 వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా  కొల్లాపూర్ పట్టణంలో గురువారం శాసనసభ్యులు భీరం హర్షవర్ధన్ రెడ్డి ఆర్డీవో హనుమాన్ నాయక్ తో కలిసి 2కె ఫ్రీడం రన్ ను జాతీయ జెండా ఊపి ప్రారంభించారు.ఈ రన్ ఆర్డీవో కార్యాలయం నుండి సోమశిల రోడ్డు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎంఎల్ఏ మీరు హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నేటి భావితరాలకు మనం వేసే ప్రతి అడుగు స్ఫూర్తి దాయకంగా నిలవాలని అన్నారు. ఆయురారోగ్యాలతో ఫిట్ ఇండియా లో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొందాం.. స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటుదాం అని అన్నారు.ఈ ఫ్రీడం రన్ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు,మున్సిపల్ అధికారులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు,పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.