4వ రోజు మహాసంగ్రామ యాత్రకు తరలిన బీజేపీ నాయకులు

ఆత్మకూరు (ఎం) ఆగస్టు 5 (జనంసాక్షి)

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మహాసంగ్రామ యాత్ర 4వ రోజులో భాగంగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఆత్మకూరు మండల అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి మరియు నాయకులు భారీగా తరలివెళ్లి పాదయాత్రలో పాల్గొన్నారు అనంతరం మండల బీజేపీ నాయకులు బండి సంజయ్ గారిని పూలమాల శాలువతో ఘనంగా సన్మానించారు