42 వ డివిజన్లో 2వ రోజు పట్టణ ప్రగతి

వరంగల్ ఈస్ట్, జూన్ 4 (జనం సాక్షి)
              పట్టణప్రగతి 4వ విడత కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున గ్రేటర్ వరంగల్  నగరంలో ని 42 వడివిజన్లో కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ఆధ్వర్యంలో  2వ రోజు పట్టణప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.  ఈ సందర్భంగా మురుగు నీరు ఉన్న స్థలాలలో గుండు చందన పూర్ణచందర్ఆయిల్ బాల్స్ వేయడంతోపాటు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చెత్తను తొలగింపజేసి శానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించినారు. అలాగే ప్రజలకు పారిశుద్ధ్య నిర్వహణ పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఇంకా ప్రజలు తమ సమస్యలను తెలియజేయడం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు కార్పొరేటర్ వివరించారు
          ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ స్పెషలాఫీసర్ రవిరాజ్, దామెరకొండ కరుణాకర్, మున్సిపల్ జవాన్లు, శానిటేషన్ సిబ్బంది మరియు మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Attachments area