5 గ్రామాల్లో గ్రామసభలు

దోమకొండ జులై 5 (జనంసాక్షి)

దోమకొండ మండలంలో దోమకొండ, అంచనూర్‌, తుజల్‌పూర్‌, యాడారం, పోచన్‌పల్లి గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించారు.ఈ సంధర్భంగా ఆయా గ్రామ సభల్లో త్రాగు నీటి కోసం, గ్రామాల్లో పారిశుద్యం లోపించిందని ప్రజలు ఎం.ఆర్‌.ఓ మోజమ్‌ అలీఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసారు.వర్షాకాలంలో అంటువ్యాధులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరారు.ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల కార్యదర్శులు, వైద్య సిబ్బంది, అంగన్‌వాడి కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.