60కి చేరిన ఉత్తరాఖండ్‌ మృతుల సంఖ్య

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతున్నాయి. గంగానది ఉధృతికి రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో కొట్టుకుపోయి అరవై మంది మృతి చెందినట్లు సమాచారం. నలబై మందికి పైగా గాయపడ్డారు. వందల ఇళ్లు నీటి ప్రవాహ ఉధృతికిఇ ధ్వంసమయ్యాయి. వేలాది మంది యాత్రికులు, భక్తులు వరదల్లో చిక్కుకున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.