లోక్‌సభలో ఆహార భద్రత బిల్లు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఆహార భద్రత బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకుని ఇవాళ లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది. ఆహార భద్రత బిల్లుపై కాంగ్రెస్‌ విప్‌ జారీ చేసింది. వచ్చేవారం ఆహార భద్రత బిల్లుపై ఓటింగ్‌ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ బిల్లును అన్నా డీఎంకే వ్యతిరేకించింది.