దిగ్విజయ్‌ని కలిసిన టీ కాంగ్రెస్‌ ఎంపీలు

ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దిగ్విజయ్‌సింగ్‌ను తెలంగాణ ప్రాంత ఎంపీలు కలిశారు.  ఈ సందర్భంగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని దిగ్విజయ్‌సింగ్‌కి ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన దిగ్విజయ్‌సింగ్‌ టీ ఎంపీలు సంయమనం పాటించాలని కోరినట్లు సమాచారం.