శివారు ప్రాంతాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ మహాధర్నా
హైదరాబాద్ : శివారు ప్రాంతాలను హైదరాబాద్ మహానగరంలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నార్సింగి వద్ద ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని 13 గ్రామాలను మహానగరంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్క తీసుకోవాలని ధర్నా చేపట్టారు. అధికార కాంగ్రెస్తో సహా అన్ని పార్టీల నేతలు మహాధర్నాలో పాల్గొన్నారు. నార్సింగి వద్ద మహాధర్నా చేస్తూ.. ఔటర్ రింగ్రోడ్డువైపు దూపుకొస్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు.



