నేటినంచి చేనేత మేళా ప్రారంభం
హైదరాబాద్ : ఈనెల 27 నుంచి అక్టోబర్ 20వ తేది వరకు హైదరాబాద్ కొండాపూర్లోని శిల్పారామంలో ‘చేనేత మేళా’ ను నిర్వహిస్తున్నట్లు చేనేత, జౌళీ శాఖ సంచాలకుడు సీ.గౌరీశంకర్ తెలిపారు. ఈ మేళాలో 80చేనేత సహకార సంఘాలు, ఏడు చేనేత క్లస్టర్స్, చేనేత ఎగుమతిదారులు, చేనేత అవార్డు గ్రహీతలు పాల్గొననున్నట్లు చెప్పారు.



