గాంధీభవన్‌ ఎదుట టీ న్యాయవాదుల ధర్నా

హైదరాబాద్‌ : సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి సీమాంధ్రకే సీఎంలా వ్యవహరించటాన్ని నిరసిస్తూ తెలంగాణ న్యాయవాదులు గాంధీభవన్‌ ఎదుట ఆందోళనకు దిగారు.వారు ఇవాళ గాంధీభవన్‌ ఎదుట ధర్నాకు దిగారు.సీఎంను వెంటనే భర్తరప్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ బైఠాయించారు.దీంతో అప్రమత్తమైన పోలీసలు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.