ఢిల్లీ : బడికెళ్లి చదువుకోవాల్సిన పదిహేనేళల్ల పిల్లల చేత నిర్బందంగా చాకిరిచేయించుకుని వారిని అనేక రకాలుగా క్రూరంగా హింసించిన రాక్షస మహిళను ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ రాక్షస మహిళ పసిపిల్లల చేత పనిచేయించుకోవడమే కాకుండా వారిని మాటల్లో చెప్పడానికి వీలులేని విధంగా హింసించి ,కుక్కలతో కరిపించి అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసింది.ప్లాట్‌ నుంచి అరుపులు వినిపించడంతో పొరుగువారు పోలీసులకు పిర్యాదు చేయడంతో ఇంటికి వెళ్లిన పోలీసులకు దయనీయమైన స్థితిలో ఓ బాలిక కనిపించింది.ఆమె ఒంటినిండా ఇంచు ఖాళీ లేకుండా ఉన్న గాయాలను చూసి పోలీసులే జడుసుకున్న పరిస్థితి. వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్చగా బాలిక తల ఎముక కూడా విరిగిందని వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు యజమానిని అరెస్టు చేశారు.

తాజావార్తలు