జగన్ ఎప్పటికి కాంగ్రెస్ పంజరంలో చిలకే : మందకృష్ణ మాదిగ
హైదరాబాద్ : జగన్ ఎప్పటికైనా కాంగ్రెస్ పంజరంలో చిలకే అని ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. సోనియా, జగన్ మద్య ఒప్పందం కుదిరిందన్నారు. రాహుల్ను ప్రధాని చేయడానికి ఒప్పందంలో భాగంగానే జగన్ను బయటకు తీసుకోచ్చారని ఆరోపించారు. సోనియా మాట వినకపోతే మళ్లీ జైలుకు పంపిస్తామన్నా భయంలో జగన్ను ఉంచారని పేర్కొన్నారు. ఒక్కసారి సీబీఐ కేసులో ఇరుక్కుంటే ఎప్పుడైనా శిక్ష తప్పదన్నారు.



