సుంకేశుల జలాశయం వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : కర్నూలు జిల్లాలోని సుంకేశుల జలాశయం వద్ద సోమవారం రైతులు చేపట్టిన సమైక్య రైతుగర్జన లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుంకేశుల జలాశయం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు ఆందోళన కారులపై లాఠిచార్జి చేసి చెదరగొట్టారు.



