ఆమ్‌ఆద్మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా : షీలాదీక్షిత్‌

ఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆమ్‌ఆద్మీ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఆమ్‌ఆద్మీ నిర్ణయాన్ని ప్రకటించిన అనంతరం షీలాదీక్షిత్‌ స్పందించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఆమ్‌ఆద్మీ పార్టీ నెరవేర్చాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. భాజపా శాసనసభా పక్ష నేత హర్షవర్ధన్‌ మీడియాతో మాట్లాడుతూ… ఢిల్లీ ప్రజలను ఆమ్‌ఆద్మీ పార్టీ మోసం చేసిందని విమర్శించారు.