75 వ స్వాతంత్ర వజ్రోత్సవాలు జయప్రదం చేయాలి :- జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్

గద్వాల రూరల్ ఆగష్టు 09 (జనంసాక్షి):- జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ నెల 8 నుండి 21 వరకు జరిగే 75వ స్వాతంత్రం వజ్రోత్సవాలను పాల్గొని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ తెలిపారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 8న ముఖ్యమంత్రి ఉత్సవాలను ప్రారంభించారని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11న ఫ్రీడం రన్ స్థానిక కృష్ణవేణి చౌక్ నుండి స్టేడియం వరకు జరుగుతుందని తెలిపారు. 16న 10:30 గంటలకు సామూహికంగా జాతీయ గీతాలాపన జరుగుతుందని ప్రతి ఒక్కరూ జాతీయ గీతం ఆలకించిన అంతవరకు ప్రతి ఒక్కరూ తాము చేస్తున్న పనులు విధుల సైతం ఆపివేసి గుండెలపై చేయి వేసుకొని జాతీయ గీతాలపన చేయాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు ఉదయం 10:30 గంటలకు ఒక్క నిమిషం పాటు సైరన్ రోగుతుంది అనంతరం జాతీయగీతం మొదలవుతుంది జాతీయ గీతం ఆలపించాలని ఎస్పీ తెలిపారు. అలాగే వ్యాసరచన క్రీడలు వక్తృత్వ రంగవల్లుల పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పి రాములు నాయక్, సిఐ లు తదితరులు పాల్గొన్నారు.