కేకే గెలుపు పట్ల కేసీఆర్‌ హర్షం

న్యూఢిల్లీ : టీఆర్‌ఎస్‌ జాతీయ కార్యదర్శి కేకేశవరావు రాజ్య సభ సభ్యునిగా ఎన్నికవడంపై ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు. తొలిసారిగా పార్టీని కేకే పెద్దల సభకు తీసుకుపోతున్నందుకు తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కేకే గెలుపుకు మద్దతు ఇచ్చినందుకు సీపీఐ పార్టీకి ధన్యావాదాలు తెలిపారు.