సోనియాతో కేసీఆర్ కుటుంబం భేటీ
న్యూఢిల్లీ : టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సకుటుంబ సపరివార సమేతంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఇవాళ ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి టెన్త్జన్పథ్కు చేరుకున్నారు. కేసీఆర్ సతీమణి, కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, కూతురు కవిత, మేనల్లుడు హరీష్రావు దంపతులు సోనియాను కలిసిన వారిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్లు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ విలీనం అంశంపై కూఆ చర్చించనున్నట్టు సమాచారం.