కోడ్ కూసింది
మోగిన ఎన్నికల నగారా
దేశవ్యాప్తంగా తొమ్మిది దశల్లో పోలింగ్
తెలంగాణలో ఏప్రిల్ 30న
సీమాంధ్రలో మే 7న
లోక్సభతో పాటే సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు
షెడ్యూల్ విడుదల చేసిన సీఈసీ వీఎస్ సంపత్
న్యూఢిల్లీ, మార్చి 5 (జనంసాక్షి) :
సార్వత్రిక ఎన్నికల కోడ్ కూసింది. దేశ వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. 16వ లోక్సభ ఏర్పాటుతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మేరకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఈ సారి మొత్తం 9 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎప్రిల్ 7 నుంచి మొదలై మే 12 వరకు 9విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. మే16 ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. ఇందుకోసం ఇవిఎంలనే వినియోగిస్తారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో నేటినుంచే కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్. సంపత్ 16వ లోక్సభ ఏర్పాటుకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను బుధవారం ఢిల్లీ విజ్ఞాన్ కేంద్రంలో కిక్కిరిసిన మీడియా సమావేశంలో విడుదల చేశారు. క్రమం తప్పకుండా జరిపే ఎన్నికల పక్రియ ఏ ప్రజాస్వామ్య దేశానికైనా కీలకమని ఆయన పేర్కొన్నారు. పూర్తి పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు ముమ్మర కసరత్తు చేశామని కమిషనర్ తెలిపారు. వివిధ రాష్టాల్ల్రో విద్యార్థుల పరీక్షలను, వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ రూపొందించామన్నారు. ఎన్నికల షెడ్యూల్పై అన్ని రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలను సంప్రదించామన్నారు. విజ్ఞాన్ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఇవాళ్టినుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తోంది. విలేకర్ల సమావేశంలోమరో కమిషనర్ హెచ్.ఎస్ బ్రహ్మ కూడా పాల్గొన్నారు. ఆంధప్రదేశ్లో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 30, మే 7న రెండు విడతలుగా రాష్ట్రంలో పోలింగ్ జరుగుతుంది. తెలంగాణలో ఎప్రిల్30న సీమాంద్రలో మే 7న ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో ఏప్రిల్ 2న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు.మొత్తానికి సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఆంధప్రదేశ్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. లోకసభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ ఎన్నికలు జరుగబోతునాయి. జూన్ రెండు నాటికి రెండు కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మొత్తం తొమ్మిది విడతల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 30న ఏడో విడత, మే 7న ఎనిమిదో విడతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఏడో విడతలో తెలంగాణ ప్రాంతంలో, ఎనిమిది విడతలో సీమాంధ్ర ప్రాంతంలో ఎన్నికలు జరగనున్నాయి. మే 16న ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల ఉంటుంది. తెలంగాణలో ఎన్నికల కోసం ఏప్రిల్ 2వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. 9 తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 10న నామినేషన్ల పరిశీలన. 12న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఏప్రిల్ 30న ఎన్నికలు ఉంటాయి. సీమాంధ్రలో ఎన్నికల కోసం ఏప్రిల్ 12వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేది ఏప్రిల్ 19. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 21న. ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 23. మే 7న ఎన్నికలు ఉంటాయి. ఇక 9 విడతల్లో ఎన్నికలు జరుగనున్న లోక్సబ ఎన్నికలు వివిధ రాష్ట్రాల్లో జరుగనున్నాయి. ఏప్రిల్ 7న తొలివిడత ఎన్నికలు 6 లోక్సభ స్థానాలకు జరుగతాయి. ఏప్రిల్ 9న రెండో విడత 5 రాష్ట్రాల్లోని 7 లోక్సభ స్థానాలకు, మూడో విడత పోలింగ్ ఏప్రిల్ 10న, 14 రాష్టాల్ల్రోని 92 లోక్సభ స్థానాలకు, నాలుగో విడత ఏప్రిల్ 12న 3 రాష్ట్రాల్లోని 5 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఐదో విడత ఏప్రిల్ 17న 13 రాష్ట్రాల్లోని 132 లోక్సభ స్థానాలకు, ఏప్రిల్ 24న ఆరో విడత 12 రాష్టాల్ల్రోని 117 లోక్సభ స్థానాలకు జరుగతాయి. ఏప్రిల్ 30న ఏడో విడతలో 9 రాష్ట్రాల్లోని 89 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతంది. మే 7న ఎనిమిదో విడతలో 7 రాష్ట్రాల్లోని 64 లోక్సభ స్థానాల్లో, మే 12న చివరి విడతలో 3 రాష్ట్రాల్లోని 41 లోక్సభ స్థానాల్లో జరిగే పోలింగ్తో ముగిస్తారు. మే 16న దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉంటుంది. బీహార్లో 8, ఉత్తరప్రదేశ్లో 6 విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. తమిళనాడు, ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్లో ఒకే విడతలో పోలింగ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎన్.సంపత్ తెలిపారు. తెలంగాణలోని పది జిల్లాల్లోను ఏప్రిల్ 30వ తేదీన, సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల్లోను మే 7వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అయితే అపాయింటెడ్ డేట్ జూన్ 2వ తేదీ అని కేంద్ర ¬ం మంత్రిత్వ శాఖ ప్రకటించింది కాబట్టి, తాము రాజ్యంగం, చట్టం ప్రకారమే వెళ్తామని.. అంటే ఉమ్మడి రాష్ట్రం మాత్రమే ఎన్నికల నాటికి, ఇప్పుడు కూడా ఉంది కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు నిర్వహిస్తామని సంపత్ చెప్పారు. పైగా తాము ఎక్కడికక్కడ అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల వారీగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో ఏప్రిల్ 2న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక్కడ నామినేషన్ల దాఖలు గడువు ఏప్రిల్ 9. 10న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 12 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఇక సీమాంధ్రలో ఏప్రిల్ 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలు గడువు ఏప్రిల్ 19. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 21న ఉంటుంది. 23 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంటుంది. రాష్ట్రంలో మొత్తం 6,24,32,064 మంది ఓటర్లుగా తేలారు. అందులో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 50,14,064మంది ఓటర్లు ఉండగా, విజయ నగరం జిల్లాలో అతి తక్కువగా 16,88,509మంది ఓటర్లుగా నమోదయ్యారు. మొత్తం 69,014 పోలింగ్ స్టేషన్లను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువగా 4,469 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, నిజామాబాద్ జిల్లాలో 2,005 అతి తక్కువగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుత 15వ లోక్సభ గడువు మే 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో 16వ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎన్ సంపత్ ప్రకటించారు. గడువుకు ముందే అంటే మే31కి ముందు అంటే 20 కల్లా ప్రక్రియను పూర్తి చేస్తారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లో నోటా అమలుచేస్తున్నారు. షెడ్యూలు ప్రకటనతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని సంపత్ తెలిపారు. రాజకీయ పార్టీలతో ఏప్రిల్ 4న సమావేశం ఉంటుందని, మే 31 నాటికి మొత్తం పక్రియ పూర్తవుతుందని ఆయన చెప్పారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూలును ప్రధాన ఎన్నికల కమిషనర్ సంపత్ ప్రకటించారు. మన రాష్ట్రంలో రెండు దశల్లో.. అంటే ఏప్రిల్ 30వ తేదీ, మే 7వ తేదీలలో ఎన్నికలు జరుగుతాయి. మొత్తం అన్ని రాష్టాల్రలోనూ లోక్భ ఎన్నికలు, వివిధ రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలు జరిగిన తర్వాత మే 16వ తేదీ శుక్రవారం నాడు ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం తొమ్మిది దశల్లో ఏప్రిల్7 నుంచి మే 12వ తేదీ వరకు పోలింగ్ జరుగుతుంది. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులకు ఖర్చు పరిమితిని 70 లక్షలుగా నిర్ణయించారు. సీఈసీతో పాటు ఎన్నికల కమిషనర్లు హెచ్.ఎస్.బ్రహ్మ, ఎస్.ఎన్.ఎ.జైదీ పాల్గొన్నారు. షెడ్యూలు ప్రకటనతో బుధవారం నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. సాధారణంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటన కేంద్ర ప్రధాన ఎన్నికల కార్యాలయంలోనే జరుగుతుంది. కానీ ఈసారి వేదికను కేంద్ర ఎన్నికల సంఘం విజ్ఞాన్భవన్కు మార్చింది. మార్చి 9వ తేదీన బూత్ లెవెల్ అధికారులు సమావేశం అవుతారని, ఆరోజున ఎన్నికల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారని ఆయన అన్నారు. ఎండలు బాగా ఉండే కాలాన్ని కూడా తాము పరిగణనలోకి తీసుకున్నామని, పంటలు, వ్యవసాయం ఊపందుకునే సమయాల్లో పోలింగ్ తేదీలు లేకుండా చూసుకున్నామని చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే పది కోట్ల మంది ఓటర్లు పెరిగారన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల పరీక్షలను కూడా దృష్టిలో పెట్టుకున్నట్లు చెప్పారు. దేశంలో మొత్తం 81.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. తాగునీటి సదుపాయాలు, షెడ్లు, మంచినీళ్ల సదుపాయం, వికలాంగుల కోసం ర్యాంపులు తప్పనిసరిగా ఉండేలా చూశామన్నారు. నోటా సదుపాయాన్ని గత ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ప్రవేశపెట్టామని, ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కూడా అవి ఉంటాయని తెలిపారు. 98.64 శాతం మంది పేర్లు, ఫొటోలు ఓటర్ల జాబితాలో ఉన్నాయన్నారు. ఇప్పటికీ ఎవరివైనా పేర్లు ఎన్నికల ఓటర్ల జాబితాలో లేకపోతే ఇప్పటికీ సరిచేయించుకోచ్చవని చెప్పారు. ఎన్నికల విధులలో పాల్గొనే అధికారులంతా నిష్పాక్షికంగా వ్యవహరించాలని, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడి ఉండాలని, క్రమశిక్షణ పాటించాలని సంపత్ స్పష్టం చేశారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 2009 ఎన్నికల నాటికి ఫొటోలతో ఓటర్ల జాబితాలు లేవని, కానీ ఈసారి మాత్రం వాటిని అమలులోకి తెచ్చామని, దీనివల్ల ఓటరు పేరు, ఫొటో, చిరునామా, పోలింగ్ కేంద్రం.. ఇలాంటి వివరాలన్నీ అందులో ఉంటాయని చెప్పారు. ఇది పోలింగ్ సిబ్బందితో పాటు ఓటర్లకు కూడా అనుకూలంగా ఉంటుందని ఆయన అన్నారు. మార్చి 9వ తేదీన 11లక్షల కేంద్రాల్లో ఓటర్ల జాబితాలో పేర్లు నమోదుచేయించుకునే అవకాశం ఉంటుందన్నారు.