అహ్మదాబాద్‌లో ర్యాలీతో ముగియనున్న కేజీవ్రాల్‌ పర్యటన

అహ్మదాబాద్‌,మార్చి8: గుజరాత్‌లో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ నాలుగు రోజుల పర్యటన అహ్మదాబాద్‌ పర్యటనతో ముగియనుంది. కేజీవ్రాల్‌ శనివారం అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ ఆశ్రమాన్ని సందర్శించడం రెండోసారని, ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో గాంధీజీ ఆత్మ ఉందని, ఆయన సిద్దాంతాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కేజీవ్రాల్‌ అక్కడ ఒక నోట్‌లో రాశారు. శుక్రవారం మోడీని కలిసేందుకు విఫలయత్నం చేసిన కేజీవ్రాల్‌ అహమ్మదాబాద్‌లో రోడ్‌ షో నిర్వహించి తన నాలుగు రోజుల పర్యటనకు ముగింపు పలకనున్నారు. గుజరాత్‌లో అభివృద్ధిని పరిశీలించడానికి గత మూడు రోజులుగా కేజీవ్రాల్‌ పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మోడీ చెబుతున్నట్లుగా అక్కడ ఎలాంటి అభివృద్ది జరగడం లేదన్నారు.