నన్ను క్షమించు.. ఆటో డ్రైవర్ లాలీ

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌కు పూల దండ వేసేందుకు వెళ్లి చెంప పగుల గొట్టిన ఢిల్లీ ఆటో డ్రైవర్ లాలీ తన తప్పును తెలుసుకుని క్షమించమి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రిని ప్రాధేయపడ్డాడు. తనపై దాడి చేసిన ఆటోడ్రైవర్ ఇంటికి వెళ్లి కలిశారు. తనపై దాడి చేసేందుకు కారణాలను తెలుసుకునేందుకు ఆయన లాలితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆటోడ్రైవర్ లాలి ‘తాను చాలా పెద్ద తప్పు చేశానని, తనను క్షమించాల’ని కోరాడు. లాలి ‘ఆప్ మద్దతు దారుడని, కేజ్రీవాల్‌పై ఎందుకు దాడి చేశాడో తెలియడం లేదని’ అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా ‘తనపై దాడి చేసిన వారిని శిక్షించవద్దని, భౌతిక దాడులకు దిగితే వారికి మనకు తేడా ఏంట’ని కేజ్రీవాల్ ప్రశ్నించారు. అనంతరం దక్షిణపురి ప్రచారంలో దాడి చేసిన అబ్దుల్ వాహిద్‌ను కలిసి మాట్లాడారు. తనపై దాడులు జరగడానికి కారణం రాజకీయ ప్రత్యర్థులేనని ఆయన స్పష్టం చేశారు.