ఐదేళ్ల బాలుడి హత్య: ఏడుగురికి జీవితఖైదు

అకోలా : ఐదేళ్ల బాలుడిని హత్య చేసిన ఘటనలో ఏడుగురికి స్థానిక సెషన్స్‌‌ కోర్టు జీవిత ఖైదును విధించింది. 2010లో జరిగిన ఈ ఘటనలో కుట్ర, హత్యకు నిందితులు పాల్పడ్డారని నిర్దారిస్తూ అకోట్ టెహ్లీ పట్టణంలోని స్థానిక న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది. వాడ్‌గావ్ రోతే గ్రామంలో అతర్వ్ బరింగే(5) ఇంటి ముందు ఆడుకుంటుండగా డిసెంబర్ 27, 2010లో కనిపించకుండా పోయాడు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అనంతరం ఓ గోనెసంచిలో బాలుడి మృతదేహం నుల్లాహ్ ప్రాంతంలో లభ్యమైంది. దీంతో హత్య కేసుగా నమోదు చేసి పోలీసుల దర్యాప్తు నిర్వహించారు. ఆస్తి తగాదాల వల్లే బంధువులే బాలుడిని హత్యచేసినట్లు గుర్తించి నిందితులను పట్టుకున్నారు.