ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను వదులుకోం: సీతారాం నాయక్

ఢిల్లీ: సీమాంధ్రుల ఒత్తిడికి కేంద్రం తలొగ్గుతున్నదని ఎంపీ ప్రొ. సీతారాంనాయక్ ఆరోపించారు. పోలవరంపై టీఆర్‌ఎస్ ఇచ్చిన నోటీసుతో కేంద్రం వెనక్కి తగ్గిందని చెప్పారు. త్వరలో దీనిపై రాష్ట్రపతిని కలిసి పరిస్థితి వివరిస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను వదులుకునేది లేదని తేల్చి చెప్పారు.