నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

న్యూఢిల్లీ : బడ్జెట్ పై భారీ అంచనాలతో లాభాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశ పెడుతుండగానే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 83 పాయింట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.