గంగా నదిలో పడిన బస్సు..9 మంది మృతి

ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్‌లోని తెహ్రి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. సంకింధార్‌కు సమీపంలో ఓ బస్సు అదుపుతప్పి గంగానదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా.. 31 మంది గాయాలపాలయ్యారు. ఢిల్లీ నుంచి గుప్తాక్షి వెళుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. బస్సు 300 మీటర్ల లోతులో పడిపోయిందని.. మృతదేహాలను వెలికితీసి, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని ఎస్‌ఎస్‌పీ జనమేజయ్ ఖండూరి వెల్లడించారు.