భూ సమస్యలను పరిష్కరించేందుకే భూభారతి

మంథని, (జనంసాక్షి) : భూ సమస్యలను పరిష్కరించేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నారని కమాన్ పూర్ సింగిల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు అన్నారు. జూన్ 3 నుంచి జూన్ 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో భాగంగా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని తాసిల్దార్ వాసంతి తో కలిసి రైతుల వద్ద నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడుతూ. . భూముల పత్రాలు సర్వేలు, రిజిస్ట్రేషన్లలో ఏర్పడిన లోపాలను సరిచేసి రైతులకు న్యాయం చేయడమే ఈ భూభారతి ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇచ్చిన హామీ మేరకు భూభారతి అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ సదస్సులో తాజా మాజీ సర్పంచ్ బొల్లపల్లి శంకర్ గౌడ్, మండల తహసిల్దార్ వాసంతి, సీనియర్ అసిస్టెంట్ సతీష్, ఆర్ఐ స్రవంతి, జూనియర్ అసిస్టెంట్లు రజిత, రాజేందర్, రంజిత్, ఆపరేటర్లు ప్రవీణ్, తోట రమేష్, వీఆర్ఏ కట్ట కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

తాజావార్తలు