ప్రధాని పేరు మరిచిపోయిన సీఎం నితీశ్ కుమార్.. నెట్టింట వీడియో వైరల్!
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చిన్న పొరపాటు కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. వేదికపై ఉన్న ప్రధానమంత్రి పేరును ఆయన మరిచిపోయారు. ప్రధాని నరేంద్ర మోదీని అటల్ బిహారీ వాజ్పేయి అని పిలిచారు. వేదికపై ఉన్న ప్రధాని మోదీ పేరు చెప్పడానికి ఆయన తడబడ్డారు. మోదీని అటల్ బిహారీ వాజ్పేయి అని సంభోదించారు. ఆ వెంటనే తన తప్పును తెలుసుకుని కవర్ చేసేందుకు ప్రయత్నించారు. ‘అటల్ బిహారీ వాజ్పేయి గతంలో అభివృద్ధి పనులు చేశారు’ అని అన్నారు. ఈ ఏడాది జనవరిలో కూడా నితీశ్ కుమార్ వింతగా ప్రవర్తించారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జరిగిన నివాళి కార్యక్రమంలో అకస్మాత్తుగా చప్పట్లు కొట్టారు. అలాగే మార్చిలో పాట్నాలో జరిగిన క్రీడా కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో నితీశ్ నవ్వడంతో పాటు పక్కనున్న వారితో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా గతంలో నెట్టింట వైరల్ అయిన విషయం