భూపాలపల్లిలో కూల్చివేతలు షురూ..!

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అక్రమ కట్టడాల కూల్చివేతలు షురూ అయ్యాయి. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న ఇంటినిర్మాణాలపై నజర్ వేసి, కూల్చివేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని 170 సర్వే నెంబర్ లో ఏలాంటి అనుమతులు లేకుండా ఇల్లు నిర్మించగా విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు బుధవారం మూకుమ్మడిగా తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాక్టర్ డోజర్ తో ఇల్లు కూల్చివేశారు. బాధిత ఇంటి యజమాని ఆందోళన చేయగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు ఉక్కుపాదం మోపడంతో ఈ ప్రాంత అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.