e-kyc అవగాహన కార్యక్రమం నిర్వహించిన, యం. భరత్ కుమార్.

 

జనం సాక్షి న్యూస్: ఉప్పునుంతల 28 సెప్టెంబర్, 2022.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండల పరిధిలోని వెల్టూర్ గ్రామం నందు పిఎం కిసాన్ పథకం e -kyc గురుంచి సంబంధిత వ్యవ సాయ విస్తరణ అధికారి యం. భరత్ కుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా  e-kyc ( ఆధార్ కార్డ్ తో ఫోన్ నంబర్) లింక్,చేసుకోని రైతుల యొక్క లిస్ట్ ను గ్రామ పంచాయతీ, ఆవరణ లో అంటించి లిస్ట్ లో ఉన్న రైతులందరూ, కూడా తప్పని సరిగా,e-kyc చేసుకోవాలని సూచించడం జరిగింది.
 E-kyc పక్రియను ఫోన్ ద్వారా, లేదా మీసేవ ద్వారా, చేసు కోవచ్చు, లింక్ చేసుకోని యెడల, వీరికి డబ్బులు జమ కావు అని సూచించడం జరిగింది.
 ఈ కార్యక్రమంలో  లింగమయ్య, రమేష్, జంగయ్య, బాల్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి, విష్ణు, దేవేందర్, నాగయ్య, లక్ష్మారెడ్డి, బాలస్వామి తది తరులు పాల్గొన్నారు.