చత్తీస్గఢ్లో ఐఈడీ పేలుడు
` ముగ్గురు గ్రామస్థులకు తీవ్ర గాయాలు
చర్ల:(జనంసాక్షి):చత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ప్రెజర్ ఐఈడీపేలుడులో శుక్రవారం ముగ్గురు గ్రామస్తులు గాయపడ్డారు.నేషనల్ పార్క్ ప్రాంతంలోని బండేపారాలో నక్సలైట్లు అమర్చిన ప్రెజర్ ఐ ఈ డీ ను ప్రమాద వశాత్తూ తొక్కడంతో ఈ ప్రమాదం జరిగింది . ఎర్రగుఫా, పారా గ్రామానికి చెందిన ముగ్గురు పని కోసం బండేపారాకు వెళుతున్నారు. ఈ క్రమంలో ఐ ఈడీ పేలి గోటే జోగా, నాగయ్య, బద్వే సునీల్ గాయపడ్డారు. గాయపడిన వారి గురించి సమాచారం అందిన వెంటనే అంబులెన్స్ను సంఘటనా స్థలానికి పంపారు. క్షతగాత్రులకు మద్దెడు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్సలు అందిస్తున్నారు. మద్దెడు పోలీస్ స్టేషన్లో ఈ మేరకు కేసు నమోదైంది.