లింగన్నపేటలో వ్యక్తి దారుణ హత్య
గంభీరావుపేట జూన్ 14 (జనం సాక్షి ):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో వ్యక్తి హత్యకు గురైన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గంభీరావుపేటగ్రామానికి చెందిన మండే సతీష్(32) అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు. బీరు ఖాళీ సీసాలతో సతీష్ ను హత్య చేసినట్లు తెలుస్తుంది. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో వ్యక్తి అక్కడికక్కడే ఘటనా స్థలంలో మృతి చెందాడు. గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసినట్టుగా స్థానికులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎస్సె ప్రేమానందం ఘటన స్థలానికి వెళ్లి పరి శీలించారు. హత్యకు దారి తీసిన పూర్తి సమాచారం తెలి యాల్సింది.