తండా నివాసి సమ్మక్క ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేసిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని, (జనంసాక్షి) : సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకమని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంథని నియోజక వర్గం పరిధిలోని కాటారం మండలం, కొత్తపల్లి తండా గ్రామ నివాసి అయిన వాంకుడోతు సమ్మక్క ఇంట్లో సన్నబియ్యంతో చేసిన బోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. రేషన్ కార్డులున్న నిరుపేదల కుటుంబాలు సన్నబియ్యం ఆహారాన్ని భుజించాలనే సంకల్పంతో ఉగాది పండుగ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి సన్నబియ్యం పంపిణిని ప్రారంభించారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వాంకు డోతు సమ్మక్క కుటుంబ సభ్యులతో ముకాముఖీ మాట్లాడారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయి, దొడ్డు బియ్యానికి సన్నబియ్యానికి తేడా ఉందా లేదా అని అడిగి తెలుసుకున్నారు.పేదలు కడుపునిండా సన్నబియ్యం తో భోజనం చేయాలని అందుకు సన్న రకం ధాన్యం అవసరమని భావించిన ప్రభుత్వం సన్నరకం ధాన్యం సాగు చేసిన రైతులకు బస్తాకు 500 బోనస్ చెల్లించినట్లు తెలిపారు. సన్నబియ్యం పధకాన్ని. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అక్రమాలకు. పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, మండల ప్రత్యేక అధికారి, డిఆర్డీఓ నరేష్, తహసీల్దార్ నాగరాజు, ఎంపిడిఓ బాబు, ఎంపివో వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.