రాజన్న.. నీ కోడెలకు దిక్కెవరూ..?
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి మే 31 (జనంసాక్షి): రాజన్న నీకు భక్తులు సమర్పించే నిజ కోడెలకు దిక్కెవరు. భక్తులు సమర్పించిన నిజ కోడెలను ఆలయ అధికారులు తిప్పాపురం గోశాలకు తరలిస్తారు.అక్కడ వాటిని సంరక్షించేందుకు సరైన సిబ్బంది లేక పోవడంతో
కోడెలు ప్రతి రోజు మరణిస్తున్నాయి.మొన్న 9,నిన్న 8,శనివారం మరో 5 కోడెలు మృతి చెందాయి.గోశాలలో 450 కోడెలు ఉండేందుకు షెడ్లను నిర్మాణం చేయగా సుమారు 1200 కోడెలు గోశాలలో ఉన్నాయి.వీటిని సంరక్షణకు సుమారు 10 మంది అవుట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు.గోశాలలో సిబ్బంది కొరత,వాటికి సరిపడే దాన లేకపోవడం కూడ ఒక కారణం.కోడెలు ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ ఆరు బయట ఉంటున్నాయి. రాజన్న ఆలయానికి కోడె మొక్కుబడి ద్వారా సింహభాగం ఆదాయం వస్తున్న ఆలయ అధికారులు కోడెలపై దృష్టి సారించక పోవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.