సమస్యలను పక్కన పెట్టారు: ఏలేటి
ఆదిలాబాద్,ఆగస్ట్17(జనంసాక్షి): కాంగ్రెస్ హయాంలోమాత్రమే రైతులకు ఎప్పుడూ న్యాయం జరిగేదని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని,అందుకే తాము ప్రజల పక్షానా పోరాడుతున్నామని అన్నారు. తెలంగాణ వచ్చాక కేవలం కేసీఆర్ కుటుంబమే లాభపడుతోందన్నారు.మంత్రులు సమస్యలను పక్కన పెట్టి అవినీతికి పాల్పడుతున్నా పట్టించుకోని సిఎం కెసిఆర్ ప్రజలను ఏం పట్టించుకుంటారని అన్నారు. కేవలం ఇతర పార్టీల వారిని టిఆర్ఎస్లో చేర్చుకోవడంలోనే కెసిఆర్ విజయం సాధించారని ఏలేటి ఎద్దేవా చేశారు. అధికారాన్ని ఉపయోగించి తమ పార్టీ నేతలు, కార్యకర్తలను బెదిరింపులకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది పేర్కొన్నారు. కాంగ్రెస్ హయంలో మంజూరైన జలాశయాలను పూర్తిచేయాల్సింది పోయి పునరాకృతి పేరుతో కొత్త జలశయాలకు తెరలేపి కాంట్రాక్టర్లనుంచి కవిూషన్లు తీసుకుంటూ దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏడు జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించే ప్రాణహిత చేవళ్ల జలశయానికి కేవలం రూ.20కోట్లు విడుదలచేస్తే పనులు పూర్తి అవుతుండగా కేసీఆర్ మాత్రం జలాశయాన్ని మేడిగడ్డకు మళ్లించి అంచనా వ్యయం ఏకంగా రూ.86వేల కోట్లకు పెంచడంతో అవినీతికి తెరలేపారని అన్నారు. ఇది కేవలం కవిూషన్ల కోసం కాక మరోటి కాదన్నారు. టిఆర్ఎస్ సర్కార్ గుత్తెదార్ల ప్రభుత్వంగా మారిందంటూ విమర్శలు సంధించారు.