అమరనాథ్ యాత్రలో మరో ఐదుగురి మృతి
జమ్ముకాశ్మీర్: అమరనాథ్ యాత్రలో మరో ఐదుగురు మృతిచెందారు. ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 83కి చేరింది. సోమవారం సాయంత్రానికి మరో 10 వేల మంది దర్శనం చేసుకున్నారు. జూన్ 23న ప్రారంభమైన ఈ ఏటి అమరనాథ్ యాత్రలో ఆదివారం సాయంత్రం వరకు 4లక్షల 82 వేల 950 మంది భక్తులు హిమలింగాన్ని దర్శించుకున్నారు. భక్తుల మరణాలు ఎక్కువగా కార్డియాక్ అరెస్ట్ వల్ల సంభవిస్తుండడంతో అధికారులు వైద్య పరీక్షల విషయమై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.