ఆలస్యంగా బయలుదేరనున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌

సికింద్రాబాద్‌: పట్టాలపై వర్షం నీరు నిలవడంతో సికింద్రాబాద్‌ నుంచి న్యూఢిల్లీ బయలుదేరే ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆలస్యంగా బయలుదేరనుంది. పొద్దున 6.25కు బయలుదేరాల్సిన రైలు 11గంటలకు బయలుదేరనుందని రైల్వేవర్గాలు తెలిపాయి.