ఉమేశ్కుమార్ పిటిషన్ను తిరస్కరించిన హైకోర్టు
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్ సంతకం ఫోర్జరీ కేసు విచారణపై ఉమేశ్కుమార్ పెట్టుకున్న పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. విచారణను సీఐడీ కోర్టు నుంచి వేరే కోర్టుకు మార్చాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. సీఐడీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలోనే విచారణ కొనసాగించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.