ఎన్ఎంయూతో ఆర్టీసీ మూడో దఫా చర్చలు
హైదరాబాద్: సమ్మె నోటీసు ఇచ్చిన ఎన్ఎంయూతో ఆర్టీసీ యాజయాన్యం మూడోదఫా చర్చలు జరిపింది. ఈ నెల 19న యాజమాన్యంతో మరోమారు చర్చలు జరుపుతామని, చర్చల అనంతరం సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని ఎన్ఎంయూ నేత నాగేశ్వరరావు తెలిపారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఒప్పంద డ్రైవర్లు, కండక్టర్లు సర్వీసులు క్రమబద్దీకరించాలని యాజయాన్యాన్ని కోరినట్లు ఎన్ఎంయూ నేతలు తెలిపారు. 2,900 మంది డ్రైవర్లు, కండక్టర్ల సర్వీసులను క్రమబద్ధీకరించడానికి యాజమాన్యం అంగీకారం తెలిపిందని వారు చెప్పారు. మరికొందరి క్రమబద్ధీకరణ విషయంలో యాజమాన్యం ప్రభ్త్వుంతో చర్చిస్తుందన్నారు.