కరువు మండలాలకు ఉపాధి హామీ పొడిగింపు

హైదరాబాద్‌: కరవు మండలాలు ప్రకటించిన ప్రాంతాల్లో ఉపాధి హామీని అదనంగా మరో 50 రోజులు పొడిగించనున్నట్లు మంత్రి మాణిక్యవరప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ నెలాఖరు లోగా కరువు మండలాల జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలియజేశారు.