గవర్నర్, ముఖ్యమంత్రి ప్రధాని సమీక్ష
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలించి… ఓమ్నీ, యశోద ఆసుపత్రుల్లో క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాని మన్మోహన్సింగ్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులతో ప్రధాని సమీక్ష చేపట్టారు. పేలుళ్ల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలను నేతలు ప్రధానిక వివరించినట్లు సమాచారం తెలిసింది.