తెలంగాణ మంత్రులతో టీఎన్జీవో నేతల భేటీ
హైదరాబాద్: నగరంలో సమావేశమైన తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ ప్రజ ప్రతినిధుల బృందంతో టీఎన్జీవో నేతలు దేవీశ్రీప్రసాద్, విఠల్, శ్రీనివాస్గౌడ్లు సమావేశమయ్యారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ సాకారం చేయాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. లేదంటే పార్టీకి, పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి కలిసి రావాలని మంత్రులకు టీఎన్జీవో నేతలు పిలుపునిచ్చారు.