నేడు కర్ణాటక భాజపా శాసనసభా పక్ష భేటీ

బెంగళూరు:కర్ణాటక భాజపా శాసనసభా పక్ష బేటీ ఈరోజు జరగనుంది.శాసనసభా పక్ష నేతగా జగదీష్‌శెట్టర్‌ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు.ఈ కార్యక్రమానికి పరిశీలకులుగా పార్టీ సీనియర్‌ నేతలు అరుణ్‌జైట్లీ రాజ్‌ నాధ్‌సింగ్‌ హజరవుతున్నారు.జగదీష్‌శెట్టర్‌ బుధవారం నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.పార్టీ ఆదేశాల మేరకు సదానందగౌడ్‌ ముఖ్యమంత్రి పదవికి ఆదివారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.