న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. భారత్‌ 317/5

హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టుమ్యాచ్‌ రెండో రోజు భారత్‌ భోజన విరామ సమయానికి 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. 307 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో బరిలోకి దిగిన భారత్‌ జట్టులో ప్రస్తుతం పుజారా 151, ధోని 63 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఉదయం వర్షం కారణంగా 25 నిమిషాల ఆలస్యంగా ఆట ప్రారంభమైంది.