నవమాసాలు మోసిన తల్లికి భారమైన అప్పుడే పుట్టిన శిశువు 

దౌల్తాబాద్ సెప్టెంబర్, 07(జనం సాక్షి): ఓ తల్లి నవ మాసాలు కడుపున శిశువును మోసి భూమిపైకి వచ్చేసరికి భారమైపోయిందేమో తన పేగును తెంచుకొని నీటి గుంట పక్కన పారవేసింది ఓ కసాయి తల్లిదండ్రులు.ఈ సంఘటన దౌల్తాబాద్ మండలంలోని గోకఫాసలాబాద్ గ్రామపంచాయతీ శివారులోని తంగేడు కుంట అనే నీటి కుంట వద్ద జరిగింది.అప్పుడే పుట్టిన ఒక శిశువును పడవేసినట్లుగా దౌల్తాబాద్ ఎస్సై రవి గౌడ్ కీ సమాచారం అందగా వెంటనే అట్టి స్థలానికి వెళ్లి పరిశీలించి చూడగా అప్పుడే పుట్టిన ఒక శిశువును ఆ నీటి కుంట ఒడ్డున గల ఒక ఎండిపోయిన కొబ్బరి చేట్టు మట్ట మీద పడవేసినట్లు సమాచారం రాగ వెంటనే ఎస్సై రవి గౌడ్ ఆట్టీ సంఘటన స్థలాన్ని పరిశీలించి అట్టీ గోకఫాసలాబాద్ గ్రామ పంచాయతీ లో కారోబార్ గా పనిచేసే మాల నరేష్, (24), ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించమని ఎస్ఐ రవి గౌడ్ తెలిపారు.