నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

హైదరాబాద్‌ : కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్‌ కు వరద ప్రవాహం కొనసాగుతుంది. సాగర్‌కు ఇన్‌ఫ్లో 2,63 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతేస్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారులు 24 గేట్లు ఎత్తి 2.21 లక్షల క్యూసెక్కుల నీటిని విడదల చేస్తున్నారు.ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.8 అడుగుల వరకు నీరు ఉందని అధికారులు తెలిపారు. అదేవిధంగా సాగర్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలకు ప్రస్తుతం 311.44 టీఎంసీల నీరు నిల్వ ఉందని వెల్లడించారు.

శ్రీశైలం జలాశయం 7 గేట్లు ఎత్తి నీటి విడుదల
శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహం భారీగా వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు జలాశయం 7 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 1.67 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి 1.92 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుందని తెలిపారు.గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులకు గాను, ప్రస్తుతం 884.05 అడుగుల వరకు నీరు నిల్వ ఉంది. గరిష్ఠ నీటి నిల్వ 215.80 టీఎంసీలకు ప్రస్తుత నీటి నిల్వ 211.91 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి చేసి 67,632క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.