2026 కల్లా ‘దేవాదుల’ పూర్తి చేస్తాం

` గత ప్రభుత్వ తీరువల్లే 15 ఏళ్లుగా నత్తనడకన ప్రాజెక్టు పనులు
` పంపింగ్‌ స్టేషన్‌ను పరిశీలించిన మంత్రులు ఉత్తవమ్‌, పొంగులేటి
` పాజెక్టు ప్రస్తుత పరిస్థితి, పనుల పురోగతిపై సమీక్ష
ములుగుబ్యూరో(జనంసాక్షి):15 ఏళ్లుగా దేవదుల ప్రాజెక్ట్‌ నత్తనడకగా సాగుతోందని, 2026 మార్చి నాటికి పూర్తి చేసి, సోనియా గాంధీతో ప్రారంభిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. 300 రోజుల పాటు నీటి ఎత్తిపోసేలా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాం అన్నారు.. పెండిరగ్‌ బిల్‌ అన్ని క్లియర్‌ చేస్తాం అన్న మంత్రులు.. పొరుగు రాష్టాల్ర తో సత్‌ సంబంధాలతో ఉంది త్వరితగతిన ప్రాజెక్టు పనుల చేపడతాం అన్నారు. గత ప్రభుత్వం కేవలం పనులు చేశారు జేబులు నింపుకున్నారు కానీ ప్రజలకు లాభం జరగలేదు. లక్ష 80 వేల కోట్లు ఇరిగేషన్‌ శాఖ పైనా ఖర్చు చేసిన గత బిఆర్‌ఎస్‌ పాలకులు పనుల పేరుతో జేబులు నింపుకున్నరని అన్నారు. ప్రాజెక్టుల పని పేరుతో గత ప్రభుత్వా నేతలు దోచుకున్నారని విమర్శించారు. ములుగు జిల్లాలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పర్యటించారు. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద దేవాదుల పంపింగ్‌ స్టేషన్‌ ను సందర్శించి, ప్రాజెక్టు ఇంటెక్‌ వెల్‌, పంప్‌ హౌస్‌ ను పరిశీలించారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయడంపై అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సవిూక్ష నిర్వహించారు. 2025 డిసెంబర్‌ నాటికి దేవాదుల ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. 2026 మార్చ్‌ లో సోనియాగాంధీ చేతుల విూదుగా ప్రాజెక్టును ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. 38 టీఎంసీల నీరు ఎత్తిపోయడానికి ప్రాజెక్ట్‌ డిజైన్‌ చేశారని ప్రస్తుతం సమ్మక్క బ్యారేజ్‌ నిర్మాణం వల్ల 60 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందన్నారు మంత్రి ఉత్తమ్‌. సంవత్సరంలో 300 రోజులపాటు 60 టీఎంసీల నీటిని లిప్ట్‌ చేసి 5.57 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని అన్నారు. గత పది ఏళ్ల కెసిఆర్‌ హయంలో దేవాదుల ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందని, కమిషన్ల కక్కుర్తి కోసం కేసీఆర్‌ ప్రాజెక్టులను ఆగం చేశారని మంత్రి ఉత్తమ్‌. మండిపడ్డారు. ఇరిగేషన్‌ శాఖ అడ్డుపెట్టుకుని కేసీఆర్‌ దోపిడీకి తీరలేపారని ఫైర్‌ అయ్యారు. ప్రతి ప్రాజెక్టులోను వేలకోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. 1.81 లక్షల కోట్ల నిధులను ఇరిగేషన్‌ శాఖకు ఖర్చుచేసినా లక్ష ఎకరాలకు అదనంగా సాగునీరు ఇవ్వలేకపోయారన్నారు. 14 వేల కోట్ల బిల్లులు పెండిరగ్‌ లో ఉంటే, 7వేల కోట్లను తమ ప్రభుత్వం రాగానే చెల్లించిందన్నారు. దేవాదుల ప్రాజెక్టు పెండిరగ్‌ బిల్లులను సైతం తప్పనిసరిగా చెల్లిస్తామని, నిర్మాణ సంస్థలు ఎటువంటి భయం లేకుండా పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. మరో వైపు దేవదుల ప్రాజెక్ట్‌ పనులు 15 ఏళ్లుగా నత్తనడకలో సాగాయి.3000 ఎకరాల భుసేకరణ చేయాల్సి వుంది. దీన్ని నవంబర్‌ 15 లోపు దీన్ని పూర్తి చేసి.. పనులను వేగంగా పూర్తి చేస్తాము రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఏదుర్కొంటున్న రైతులకు హావిూ ఇచ్చిన మేరకు బూముల నష్టపరిహారం ఇస్తాము అని హావిూ ఇచ్చారు. గోదావరి పరివాహక ప్రాంతంలో కట్టిన ప్రాజెక్టులతో ..ఉమ్మడి వరంగల్‌ జిల్లాతోబాటు. నల్గొండ,ఖమ్మం జిల్లాలకు పాక్షికంగా నీళ్లు అందుతాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక. దేవాదుల ప్రాజెక్ట్‌ కి పెద్ద పీట వేయడం జరుగుతుందన్నారు మంత్రి పొంగులేటి. 15 ఏళ్లుగా నత్తనడకలో దేవదుల ప్రాజెక్ట్‌ సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. 3 లక్షల ఆయకట్టుకు 2026 సంవత్సరా లో ఇచ్చేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దేవాదుల ప్రాజెక్ట్‌ ఇన్‌ డెప్త్‌గా పరిశీలన చేయడం జరిగిందన్నారు. 3000 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. మంత్రుల పర్యటనలో పాల్గొన్న ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రి ఉత్తమ దృష్టికి తీసుకెళ్లారు. వారందరూ సూచనలను పరిగణలోకి తీసుకుంటామని మంత్రి ఉత్తమ్‌ పేర్కొన్నారు. అతి త్వరలోనే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఐదున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని అన్నారు. భూముల ధరలు పెరగడంతో భూ సేకరణ ఇబ్బందిగా మారిందని రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్‌ ప్రాజెక్టుల భూసేకరణ కోసం ఐఏఎస్‌ అధికారిని నియమిస్తున్నామన్నారు. సమ్మక్క బ్యారేజ్‌ ఎన్‌ఓసి కోసం చత్తీస్గడ్‌ ప్రభుత్వంతో చర్చలు జరిపి త్వరలోనే సి డబ్ల్యూ సి నుండి అనుమతులు తెచ్చుకుంటామన్నారు. నిధుల కొరత ఉన్నప్పటికీ తెలంగాణ గ్రావిూణ ముఖచిత్ర మార్చడమే లక్ష్యంగా ప్రాజెక్టును గురి చేసే విధంగా ముందుకెళ్తామన్నారు.